బుర్రిపాలెంలో ఓ స్మారక కార్యక్రమం నిర్వహించబోతున్న మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి స్వస్థలం బుర్రిపాలెంలో ఓ స్మారక కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. కృష్ణ భార్య , మహేష్ బాబు తల్లి ఇందిరా గత నెల 28న మరణించిన సంగతి తెలిసిందే. ఈమె మరణంతో కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు , సినీ ప్రముఖులు విషాదం నెలకొంది. నిన్న శనివారం ఆమె పెదకర్మ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది.
ఈ కార్యక్రమంలో మహేశ్బాబు తన తల్లి కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 16న కృష్ణ స్వస్థలం బుర్రిపాలెంలో ఓ స్మారక కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి కృష్ణ కుటుంబ సభ్యులంతా స్వగ్రామానికి వెళ్తున్నారని, కృష్ణ పుట్టిన గ్రామంలో స్మారక కార్యక్రమం నిర్వహించాలని మహేశ్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహితుల నుంచి సమాచారం. ప్రస్తుతం మహేష్ ..త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా, రెండొవ షెడ్యూల్ అతి త్వరలో మొదలుకాబోతుంది. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తుండగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పూజా హగ్దే హీరోయిన్.