ఉత్తరప్రదేశ్ లో ఘోరం : ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశారు

కామాంధుల చేతుల్లో అభం శుభం తెలియని చిన్నారులు బలి అవుతున్నారు. వారి కామ కోర్కెలు తీర్చుకోవడానికి చిన్నారులను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ప్రతి రోజు రాష్ట్రంలో పదుల సంఖ్య లో అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగాఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ మొరదాబాద్​లో చోటుచేసుకుంది.

మొరదాబాద్​లో గుర్తుతెలియని వ్యక్తులు 7 ఏళ్లు చిన్నారిని కిడ్నాప్​ చేసి అత్యాచారం చేసారు. ఆ తర్వాత ఆ బాలిక ను చంపేసి కాంత్ ప్రాంతంలో ఉండే చెరుకు తోటల్లో బాలిక మృతదేహాన్ని పడేసి వారు. బాలిక మృతదేహాన్ని గుర్తించిన ఓ రైతు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన వైద్యులు.. చిన్నారిపై అత్యచారం జరిగినట్లు నిర్ధరించారు. బాలిక ఆచూకీ తెలియడం లేదని తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోక్సో, ఐపీసీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే దోషులను పట్టుకుంటామన్నారు.