పెద్ద హీరోల రెమ్యూనరేషన్ కాదు ముందు మీ భారతి సిమెంట్ ధర తగ్గించుకోండి – గోరంట్ల బుచ్చ‌య్య‌

ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ ధర వ్యవహారం హాట్ టాపిక్ అయినా సంగతి తెలిసిందే. ప్రస్తుతం టి కూడా రాని ధరకు సినిమా టికెట్స్ ధరలు పెట్టడం ఫై జగన్ సర్కార్ ఫై సినీ ప్రముఖులే కాదు రాజకీయ నేతలు , సినీ లవర్స్ సైతం మండిపడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సినిమా థియేటర్స్ నడపలేమని థియేటర్స్ యాజమాన్యాలు తమ థియేటర్స్ ను మూసివేస్తున్నారు.

ఈ క్రమంలో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ నాయ‌కుడు గోరంట్ల బుచ్చ‌య్య‌… ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చి వార్తల్లో నిలిచారు.ఆంధ్రప్రదేశ్ లో సిమెంట్ బస్తా రేటు కూడా ₹100 కి తీసుకొచ్చి.. దేశ చరిత్రలోనే నిజంగా చిత్తశుద్ది ఉన్న ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకోండంటూ ట్వీట్ చేశారు. పెద్ద హీరోలని రెమ్యూనరేషన్ తగ్గించమనడం కాదు ముందు మీ భారతి సిమెంట్ బ్యాగ్ మీద మీ కమిషన్లు తగ్గించు కుంటే వాటి రేటు కూడా తగ్గుతాయని గోరంట్ల అన్నారు. ఉచితంగా ఇల్లు ఇస్తాము అని చెప్పి 5 బస్తాలు భారతి సిమెంటు ఖచ్చితంగా కొనాలి అనే దాంట్లో మర్మం కూడా ప్రజలకి చెప్పాలి అని ఎద్దేవా చేసారు. మరి గోరంట్ల బుచ్చ‌య్య‌ కామెంట్స్ ఫై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.