నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నమంత్రి కెటిఆర్‌

Minister KTR will visit Rajanna Sirisilla district today

హైదరాబాద్‌ః నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మండలాల్లో మంత్రి కెటిఆర్‌ పర్యటించనున్నారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణానికి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో కలిసి ఉదయం 9.30 గంటలకు, 10.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సాయిమణి గార్డెన్‌లో బిఆర్‌ఎస్‌ యూత్‌ నాయకుడు కొర్రీ అ నిల్‌కుమార్‌ వివాహ వేడుకలకు హాజరవుతారు. 12.30 గంటలకు యూత్‌ నాయకుడు సుధాకర్‌ ఏర్పాటు చే సిన డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను ప్రారంభిస్తా రు. మధ్యాహ్నం ఒంటి గంటకు సిరిసిల్లకు చేరుకుంటారు.

మున్నూరుకాపు సంఘ కల్యాణమండపంలో టీఆర్‌ఎస్వీ నేత శ్రీనివాస్‌ యాదవ్‌ వివాహ వేడుకలకు హాజరవుతారు. 1.15 గంటలకు చేనేత వస్త్ర వ్యాపార సం ఘ భవనంలో వస్త్ర వ్యాపార సంఘం నూతన పా లకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎస్పీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, మధ్యాహ్నం 3 గంటలకు తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణ మవుతారు.