నేడు అమెరికా పర్యటనకు వెళ్లనున్న మంత్రి కెటిఆర్‌

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి టూర్‌..

Minister KTR will go on a visit to America today

హైదరాబాద్‌ః మంత్రి కెటిఆర్‌ ఈరోజు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. పెట్టుబడుల లక్ష్యంగా నేటి నుంచి రెండు వారాల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. టూర్‌లో భాగంగా మంత్రి అమెరికాలోని ప్రముఖు కంపెనీల ఛైర్మన్లు, సీఈఓలు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న విధానాలను మంత్రి వారికి వివరించనున్నారు. కెటిఆర్‌తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో పాటు పలువురు అధికారులు కూడా అమెరికా వెళ్లనున్నారు. అంతేకాక తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న విధానాలను అమెరికన్‌ ఇన్వెస్టర్లకు వివరించనున్నారు. ఈ టూర్‌లో భాగంగా తెలంగాణలో పెట్టుబడులపై కొన్ని కీలక ఒప్పందాలు జరగనున్నట్లు పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి.

కాగా, ఇటీవల లండన్‌ టూర్‌ వెళ్లిన మంత్రి కెటిఆర్‌ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించిన విషయం తెలిసిందే. స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ దిగ్గజం డాన్జ్ హైదరాబాద్​లో ప్రొడక్ట్ డెవలప్​మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. వీటితో పాటు బ్రిటన్‌కు చెందిన ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్ రూ.200 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో పరిశ్రమ పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే కెటిఆర్‌ తాజా అమెరికా టూర్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.