చంద్రబాబు వైస్సార్సీపీ లోకి వస్తే MLC పదవి ఇస్తాం అంటూ మంత్రి జయరాం కామెంట్స్

ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ తో సహా ప్రతిపక్ష పార్టీలు కూడా జనాల్లోకి ఏదొక కార్యక్రమంతో వెళ్తున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూల్ పర్యటన చేసారు. ఈ పర్యటన లో వైస్సార్సీపీ ఫై ఘాటైన వ్యాఖ్యలు చేసారు. ఇక చంద్రబాబు తమ పార్టీలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటూ మంత్రి జయరాం అనడం ఇప్పుడు చర్చ గా మారాయి. చంద్రబాబుకు మతిస్థిమితం తప్పిందని, ఎన్ని మాటలు చెప్పినా రాష్ట్ర ప్రజలు ఆయనను నమ్మరని విమర్శించారు.

రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు చిత్తశుద్ధి లేదని ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని అన్నారు. చంద్రబాబు సానుభూతి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆయనకి ఇప్పటికే చివరి ఎన్నికలు అయిపోయాయని.. 2024 ఎన్నికలలో చంద్రబాబు పోటీ చేయరని అన్నారు. ఒకవేళ చంద్రబాబు వైస్సార్సీపీ పార్టీలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, అలాగే లోకేష్ కూడా తమ పార్టీలో చేరితే కో – ఆప్షన్ మెంబర్ చేస్తామని సెటైర్ వేశారు.