గుడివాడ అమర్నాథ్ వింత వ్యాఖ్యలు

మరోసారి వైస్సార్సీపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై మాటల యుద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం గత పది రోజులుగా ఉభయ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. జనసేన అధికారంలోకి వస్తే ఏంచేస్తుందో ప్రజలకు తెలియజేస్తూనే ..అధికార పార్టీ వైస్సార్సీపీ ఫై నిప్పులు చెరుగుతున్నారు. Hello AP ..Bye Bye YCP అంటూ తనదైన స్టయిల్ లో పంచ్ లేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.

మరోపక్క వైస్సార్సీపీ నేతలు వరుస పెట్టి పవన్ ఫై మాటల యుద్ధం చేస్తూ కౌంటర్లు , విమర్శలు , సెటైర్లు వేస్తున్నారు. తాజాగా గుడివాడ అమర్నాథ్ పవన్ ఫై విమర్శలు చేస్తూ వింత వ్యాఖ్యలు చేసారు. మూడో,నాలుగో పెళ్లిళ్లు చేసుకుంటే ముఖ్య‌మంత్రి అయ్యే యోగం ఉందంటే తాను కూడా అన్ని పెళ్లిళ్లు చేసుకుంటాన‌ని చెప్పుకొచ్చాడు. ఈసారి కూడా గెలవలేనని ముమ్మిడివరంలో పవన్‌కు జ్ఞానోదయం అయిందని అన్నారు. ఉపవాసాలు చేస్తేనో, నలుగురిని పెళ్లి చేసుకుంటేనో, నలుగురిని తిడితేనో ముఖ్యమంత్రి కాలేరని.. తనకు ఉప ముఖ్యమంత్రి కావాలని ఉంది. నేనూ 15 రోజులు ఉపవాసాలు చేస్తాను. అయిపోతానా? అని సెటైర్లు వేశారు.

ఒక లీడర్‌‌కు కావాల్సిందేంటి? నిబద్ధత, డెడికేషన్, స్థిరత్వం, సహనం ఉండాలని.. పెళ్లిళ్లు చేసుకోవడం కాదని చెప్పుకొచ్చారు. అభిమానులు ఉన్నారు. సినీ నటుడిగా చరిష్మా ఉంది. కాపు కులంలో పుట్టారు కాబట్టి.. అది కూడా కలిసి వస్తుంది. నిజంగా వీటన్నింటినీ వాడుకోవాలని అనుకుంటే. దానికి అనేక రకాల దారులు ఉన్నాయని పవన్ కు సలహా ఇచ్చారు. డెడికేషన్ ఉండుంటే.. కనీసం ఎమ్మెల్యే అయినా అయ్యే వారేమో అని ఎద్దవా చేశారు.