బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి ఈటెల
హైదరాబాద్: మంత్రి ఈటెల రాజేందర్ ఈరోజు ఉదయం దత్తాత్రేయ నగర్లో బస్తి దవాఖానను స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గౌడ్తో కలిసి ప్రారంభించారు. బస్తి దవాఖానలో అన్ని రకాల పరీక్షలకు సంబంధించిన నమూనాలను సేకరించి అందరికి మెరుగైన వైద్యం అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. బస్తి దవాఖానలో మందుల కొరత ఉండబోదని, ఇప్పటికే ఉన్న దవాఖానాలకు అదనంగా మరో 90 బస్తి దవాఖానలను ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/