భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 796 పాయింట్లు నష్టపోయి 66,800కి పడిపోయింది. నిఫ్టీ 231 పాయింట్లు కోల్పోయి 19,901కి దిగజారింది. మార్కెట్లు మగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.09 వద్ద కొనసాగుతుంది.