కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ లో గత కొద్దీ రోజులుగా వరుసగా అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఘటనల్లో పలువురు ప్రాణాలు సైతం పోవడం జరిగింది. తాజాగా గురువారం రాత్రి రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో అగ్ని ప్రమాదం జరిగింది.

కాటేదాన్ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్లాస్టిక్ బాటిల్స్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అర్ధరాత్రి ఈ అగ్నిప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, కొన్ని గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదం ఫై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.