మల్కాజిగిరి బరిలో బిఆర్ఎస్ అభ్యర్థిగా మర్రి రాజశేఖర్‌రెడ్డి..?

మల్కాజిగిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బిఆర్ఎస్ కు రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో బిఆర్ఎస్ అధిష్టానం ఎవర్ని బరిలోకి దింపుతుందో అని మూడు రోజులుగా అంత మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో గులాబీ బాస్ మల్కాజిగిరి బరిలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ని దింపబోతున్నట్లు సమాచారం అందుతుంది.

మరోవైపు జనగామ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని రంగంలోకి దింపనున్నట్లు వినికిడి. నర్సాపూర్‌ నుంచి సునీతా లక్ష్మారెడ్డి పేర్లు కూడా ఖరారైనట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు గోషామహల్‌ స్థానానికి నంద కిశోర్‌, ఆశీష్‌ కుమార్‌ యాదవ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు టాక్. వీరిద్దరిలో ఒకరికి సీటు వచ్చే అవకాశాలున్నాయి. ఈ అభ్యర్థుల పేర్లను అధికారికంగా త్వరలోనే ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.