లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఆర్థిక సంవత్సరాన్ని మార్కెట్లు లాభాల్లో ప్రారంభించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 363 పాయింట్లు లాభపడి 74,014కి చేరుకుంది. నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 22,464 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.86.64 వద్ద కొనసాగుతుంది.