లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయిః నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 305 పాయింట్లు లాభపడి 73,095 వద్ద ముగిసింది. నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 22,198 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.90 వద్ద కొనసాగుతుంది.