లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
![sensex](https://www.vaartha.com/wp-content/uploads/2020/04/sensex-3.jpg)
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 455 పాయింట్లు లాభపడి 72,186కి చేరుకుంది. నిఫ్టీ 158 పాయింట్లు పుంజుకుని 21,929 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.05గా ఉంది.