రెండో రోజు భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. దీంతో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 967 పాయింట్లు లాభపడి 71,484కి ఎగబాకింది. నిఫ్టీ 274 పాయింట్లు పెరిగి 21,457కి చేరుకుంది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.01 వద్ద కొనసాగుతుంది.