స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఆటో సూచీల అండతో మళ్లీ కోలుకుని లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 125 పాయింట్లు లాభపడి 54,403కి చేరుకుంది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 16,258 వద్ద స్థిరపడింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/