ఇండియా పోస్ట్ కస్టమర్లకు డాక్పే యాప్
దేశ వ్యాప్తంగా తపాలా నెట్వర్క్ సేవలు
ముంబై: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాదారులు బ్యాంకింగ్ సేవలు నిర్వహించుకునేందుకు వీలుగా డాక్-పే యాప్ను ప్రారంభించింది తపాలా శాఖ. భార తీయ తపాలా శాఖ తీసుకువచ్చిన డాక్-పే పేమెంట్ యాప్ ద్వారా తపాలా శాఖ, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు (ఐపిపిబి) ఖాతాదారులు డిజిటల్ ఆర్థిక సేవలు నిర్వహించవచ్చు.
దేశ వ్యాప్తంగా తపాలా నెట్వర్క్ ద్వారా ఇండియా పోస్ట్, ఐపిపిబి అందించే బ్యాంకింగ్ సేవలను వినియోగదారులు డాక్పే యాప్ ద్వారా పొంద వచ్చునని తెలిపింది. నగదును పంపించడం, క్యూఆర్ కోడ్ స్కానింగ్, సేవలు వ్యాపారులకు చేసే చెల్లింపుల వంటి సేవలను ఖాతాదారులు డిజిటల్గా పూర్తి చేసుకోవచ్చు. తపాలా శాఖ అం దించే ఆర్థిక సేవలను ఇంటి వద్ద పొందవచ్చు.
తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/