లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలలో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 138 పాయింట్లు లాభపడి 65,539కి చేరుకుంది. నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 19,465 వద్ద స్థిరపడింది. రియాల్టీ, పవర్, ఐటీ, హెల్త్ కేర్ తదితర సూచీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి.