భారీ నష్టాలలో స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత సూచీలు మళ్లీ కోలుకోలేదు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 485 పాయింట్లు పతనమై 52,568కి పడిపోయింది. నిఫ్టీ 151 పాయింట్లు కోల్పోయి 15,727కి దిగజారింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.71 వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/