లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ లో కూడా లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 350 పాయింట్లు లాభపడి 63,143కి పెరిగింది. నిఫ్టీ 127 పాయింట్లు పుంజుకుని 18,726కి ఎగబాకింది. మార్కెట్లు మగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.54 వద్ద కొనసాగుతుంది.