నాలుగో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 123 పాయింట్లు పెరిగి 62,969కి చేరుకుంది. నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 18,634 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.71 వద్ద కొనసాగుతుంది.