ఈరోజు కూడా నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 286 పాయింట్లు నష్టపోయి 65,226కి పడిపోయింది. నిఫ్టీ 92 పాయింట్లు కోల్పోయి 19,436 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.23 వద్ద కొనసాగుతుంది.