లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex.
sensex.

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. కీలక రేట్లను ఆర్బీఐ పెంచడం, అదానీ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం మార్కెట్లలో జోష్ నింపింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 378 పాయింట్లు లాభపడి 60,664కి చేరుకుంది. నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 17,872కి ఎగబాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.50 వద్ద కొనసాగుతుంది.