భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు రాకెట్ లా దూసుకుపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 909 పాయింట్లు లాభపడి 60,841కి పెరిగింది. నిఫ్టీ 243 పాయింట్లు ఎగబాకి 17,854కి చేరుకుంది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ 81.86 వద్ద కొనసాగుతుంది.