నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 64 పాయింట్లు నష్టపోయి 66,408కి పడిపోయింది. నిఫ్టీ 17 పాయింట్లు కోల్పోయి 19,794 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద కొనసాగుతుంది.