నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 790 పాయింట్లు నష్టపోయి 72,304కి పడిపోయింది. నిఫ్టీ 247 పాయింట్లు కోల్పోయి 21,951కి దిగజారింది. ఈరోజు అన్ని సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయ మారకం విలువ రూ.82.84 వద్ద కొనసాగుతుంది.