మరోసారి చంద్రబాబు ఫై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

వైస్సార్సీపీ మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి నారా చంద్రబాబు నాయుడు ఫై , లోకేష్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. నారా లోకేష్ తల్లే ఆడదా..? జగన్ తల్లి, భార్య ఆడవాళ్లు కారా..? మా భార్య బిడ్డలు ఆడవాళ్లు కారా..? లోకేష్ తల్లిని అల్లరి చేసింది చంద్రబాబేనని ఫైర్‌ అయ్యారు. ‘మీరు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా మాట్లాడొచ్చా? సీఎం జగన్‌ డీఎన్‌ఏ రాయలసీమది.. లోకేష్‌ డీఎన్‌ఏ తెలంగాణది. చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసు. తెలంగాణలో పుట్టి, అక్కడే పెరిగి ఇక్కడ యాత్ర చేస్తున్నాడు. ఒక ఎజెండా లేకుండా లోకేష్‌ యాత్ర చేస్తున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ ప్రాజెక్టులు నిండలేదు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు. నేను బూతులు మాట్లాడతాను అనే వాళ్లకి చంద్రబాబు, లోకేష్‌ మాట్లాడే మాటలు వినిపించడం లేదా?’ అని కొడాలి నాని ప్రశ్నించారు.

నన్నో.. వంశీనో.. అంబటినో.. ద్వారంపూడినో టచ్ చేసి చూడు లోకేష్.. దమ్ముంటే.. ఒక్కడినైనా టచ్ చేసి చూడన్నారు. మరోసారి భారతమ్మ పేరు ప్రస్తావిస్తే అంతు చూస్తామని… జగన్ ఊరుకుంటారేమో కానీ.. మేం ఒప్పుకోమని హెచ్చరించారు. 420 చంద్రబాబు.. పార్టీ నడిపే విధానాం ఇదేనా..? రేపట్నుంటి చూసుకుందాం.. నువ్వో నేనో అన్నారు. చంద్రబాబన ఓ కాపీ రాయుడు… జగన్ గృహసారధులంటే.. చంద్రబాబు సాధికారిక సారధులన్నాడని తెలిపారు. ఎవడోకడి తోక పట్టుకుని వేలాడ్డమే చంద్రబాబు పని…చంద్రబాబుకు బుర్ర ఉందా..అని ప్రశ్నించారు.