ఫిబ్రవరి 22 నుండి ఓటిటిలోకి వారసుడు

విజయ్ – రష్మిక జంటగా నటించిన వారసుడు మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ తమిళ్ లో వరిసు గా జనవరి 11 న విడుదలై యావరేజ్ టాక్ సొంతం చేసుకోగా..జనవరి 12 న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి జనవరి 11 నే తెలుగు , తమిళ్ భాషల్లో రిలీజ్ చేయాలనీ దిల్ రాజు భావించాడు. కానీ వాల్తేర్ వీరయ్య , వీర సింహ రెడ్డి చిత్రాల రిలీజ్ ఉండడం తో థియేటర్స్ కు ఇబ్బంది అవుతుందని భావించి, జనవరి 12 న విడుదల చేసారు. తమిళ్ లో భారీ వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ..తెలుగు లో మాత్రం ప్లాప్ గా మిగిలింది. ఇక ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది.

‘వారిసు’ మూవీ ఫిబ్రవరి 22 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ NXTలో (కేవలం యూఎస్‌లో) ప్రీమియర్ చేయబడుతుందని ఇదివరకే ప్రకటించగా.. ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఇదే తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించింది. జయసుధ, ప్రకాష్ రాజ్, శరత్‌కుమార్, యోగి బాబు, శ్రీకాంత్, ఖుష్భు తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు. దిల్ రాజు తమిళ్‌లో నిర్మించిన మొదటి సినిమా ఇదే కాగా.. దర్శకుడు వంశీ పైడిపల్లికి కూడా ఇదే మొదటి సినిమా.