తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు ఉషారాణి

ఏపీకి చెందిన మావోయిస్టు ఉషారాణి..తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయింది. దండ‌కార‌ణ్యం డివిజ‌న‌ల్ క‌మిటీ సెక్ర‌ట‌రీగా ఉషారాణి అలియాస్ పోచ‌క్క‌ ప‌ని చేస్తున్న‌ట్లు డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి మీడియాతో తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది.. ఈ క్రమంలోనే ఆమె లొంగిపోయిన‌ట్లు పేర్కొన్నారు.

డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీ‌లో అధిపత్య పోరు కొనసాగుతోందని. ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందన్నారు. విలీన సమయంలో గ్రూపుల మధ్య విభేదాలు వచ్చినట్టుగా చెప్పారు. మావోయిస్టు అగ్రనేతలంతా అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. అనారోగ్యానికి గురైన మావోయిస్టు లీడర్లు లొంగిపోతే వైద్యం అందిస్తామని అన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వపరంగా అన్ని సహాయక చర్యలు అందిస్తామని హామీ ఇచ్చారు. 31 ఏళ్ల పాటు ఆజ్ఞాతంలో ఉన్న ఉషారాణి అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నట్లు తెలిపారు. విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే ఆమె పీపుల్స్ వార్‌ అనుబంధ గ్రూప్స్‌లో పనిచేశారని చెప్పారు. మొబైల్ పొలిటికల్ టీచర్‌గా దండకారణ్యంలో సేవలందించారని తెలిపారు. మావోయిస్టు పొలిటికల్ మ్యాగజైన్స్‌కు ఎడిటర్ గా పనిచేశారని చెప్పారు.అనేక కేసులతో ఉషా రాణికి సంబంధం ఉందన్నారు.

మావోయిస్టు ఉషారాణి స్వ‌స్థ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తెనాలి. ఆమె మ‌ద్రాస్ యూనివ‌ర్సిటీలో ఎంఏ చ‌దివారు. 1980లో మావోయిస్టు పార్టీలో చేరారు. దాదాపు 40 ఏండ్ల పాటు ఆమె వివిధ హోదాల్లో మావోయిస్టు పార్టీలో ప‌ని చేశారు.