పవన్ కళ్యాణ్ పై మంచు విష్ణు సైటైర్లు ..

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు సైటైర్లు వేశారు. ఆదివారం జలవిహార్‌లో జరిగిన అలయ్‌బలయ్‌ కార్యక్రమానికి రాజకీయ నేతలు, సినీ ప్రముఖులతో పాటు పలువురు ఇతర రంగాలవారు హాజరయ్యారు. వారిలో మంచు విష్ణు కూడా ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌తో మాట్లాడేందుకు ‘మా’ అధ్యక్షులు మంచు విష్ణు ప్రయత్నించగా ఆయన పట్టించుకోలేదు. పవన్‌, మంచు విష్ణు సుమారు గంట పాటు పక్కపక్కనే కూర్చున్నా… ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడి చేత మెమెంటో అందుకునే సందర్భంలో కూడా పక్కపక్కనే నిలబడినా మాట్లాడుకోలేదు. ఈ సందర్భంగా పవన్‌ వేదికపై ఉన్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన విష్ణు ‘‘ఈయన ఎవరో ఊహించగలరా?’’ అంటూ చేసిన వ్యాఖ్య చర్చనీయాంశమైంది.

ఇక మా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎవరికి తన మద్దతు అనేది బయటకు చెప్పకపోయినా , మీడియా లో మాత్రం ప్రకాష్ రాజ్ కే మద్దతు ఇచ్చారని ప్రచారం జరిగింది. ఇక నిన్న జరిగిన అలయ్‌బలయ్‌ కార్యక్రమంలో విష్ణు , పవన్ కళ్యాణ్ ల తీరు చూస్తే నిజమే కావొచ్చని అంత అనుకుంటున్నారు. మరోపక్క మోహన్‌బాబుకు చిరంజీవి.. ఫోన్‌ చేసి తాను ఎవరికీ మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అకారణంగా తన పేరు బయటకు వచ్చిందని చెప్పారట. మోహన్‌బాబు స్నేహపూర్వకంగా స్పందించారని, అందరం కలసికట్టుగా ఉండాలనేది తన అభిమతమని చిరంజీవితో చెప్పినట్టు సమాచారం.

Can you guess whose at the end of the video? 💪🏽 pic.twitter.com/FJyMiWRA2T— Vishnu Manchu (@iVishnuManchu) October 17, 2021