మద్యంలో పురుగుల మందు.. తాగుతామనేసరికి?

అటుగా వచ్చిన స్నేహితుడు చెప్పిన వినకుండా మద్యం త్రాగిన వైనం

man-dies-after-drinking-pesticide
man-dies-after-drinking-pesticide

గుంటూరు: తుళ్లూరు మండలం వెంకటపాలేనికి చెందిన పులి హరిబాబు (35) అనే వ్యక్తి ఈ రోజు ఉదయం తన ఇంట్లో డబ్బులు కావాలని అడిగాడు. అందుకు ఇంట్లో వారు నిరాకరించారు. దీంతో కోపం వచ్చిన హరిబాబు చనిపోవాలనుకుని మద్యం తెచ్చుకుని అందులో పురుగుల మందు తాగాడు. అతడు మద్యం తాగే సమయంలో అటుగా వచ్చిన దాసరి వందనం (65) లాక్కుని మద్యం తాగేశాడు. ఇద్దరూ పురుగుల మందు తాగిన మద్యం సేవించారు. వారిలో హరిబాబు ప్రాణాలు కోల్పోయాడు. దాసరి వందనను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. హరిబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/