మమతా బెనర్జీ ఓటమి!
బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 1,736 ఓట్ల మెజారిటీతో విజయం
![Mamata Banerjee](https://www.vaartha.com/wp-content/uploads/2021/05/Mamata-Banerjee-loses-in-Nandigram-1024x583.jpg)
నందిగ్రామ్ అసెంబ్లీ పోలింగ్ ఓట్ల లెక్కిపులో సీఎం మమతా బెనర్జీ ఓటమి చెందినట్టు ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 1,736 ఓట్ల మెజారిటీతో సీఎం మమతా బెనర్జీపై విజయం సాధించారని ప్రకటించారు. ఓవైపు రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసిన నేపథ్యంలో , పార్టీ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/