దసరా బరిలో ‘మహా సముద్రం’
శర్వానంద్ – సిద్ధార్థ్ హీరోలుగా RX 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘మహాసముద్రం’. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో అదితీ రావు, అను ఇమాన్యూయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ తాలూకా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించి అభిమానుల్లో ఆసక్తి నింపారు. విజయదశమి పండుగ సందర్భంగా ఈ మూవీ ని అక్టోబర్ 14న విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.
ఈ మేరకు ఓ ఆసక్తికరమైన మోషన్ పోస్టర్ కూడా వదిలారు. ఈ పోస్టర్లో శర్వానంద్ – సిద్ధార్థ్ ఒకరిపై ఒకరు తుపాకులు గురిపెట్టి సీరియస్ లుక్తో కనిపిస్తున్నారు. దసరా బరిలో నిలవనున్న ఈ చిత్రం ఇతర చిత్రాలకు పోటీగా తట్టుకొని మంచి విజయం సాధిస్తుందా అన్నది చూడాలి. ఇక ఈ మూవీ లో సీనియర్ హీరో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా..ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.