జగన్ కు నారా లోకేష్ మ‌రో బ‌హిరంగ లేఖ

తెలుగుదేశం నేత , చంద్రబాబు తనయుడు నారా లోకేష్..మరోసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి బ‌హిరంగ లేఖ రాసారు. బిల్లులు చెల్లించాలని పోరాడుతున్న విజయనగరం చెరకు రైతులపై కేసులు పెట్టడం ప్రభుత్వ అహంకార ధోరణికి నిదర్శనమని ఆయన లేఖలో పేర్కొన్నారు. రైతులకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు.

వ్యవసాయ రంగం పట్ల నిర్లక్ష్యం, ధాన్యం బకాయిలు, పంట నష్ట పరిహారం రాకపోవడం, రైతుకి ఉపయోగం లేని ఆర్బీకే సెంటర్ల కారణంగా రైతులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బకాయి బిల్లులు చెల్లించకపోవడంతో చెరకు రైతులు నష్టాల్లో కూరుకుపోయారని… విజయనగరంలోని ఎన్‌సిఎస్‌ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం రెండు వేల మంది చెరకు రైతులకు రెండు సీజన్ల బకాయి బిల్లులు రూ.17 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందన్నారు.