లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ..హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేశ్

Lokesh anticipatory bail petition ..ongoing arguments in the High Court

అమరావతిః అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టిడిపి యువనేత నారా లోకేశ్ ను సీఐడీ ఏ14గా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో లోకేశ్ ను సీఐడీ అధికారులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఏపీ హైకోర్టులో నారా లోకేశ్ ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రస్తుతం ఈ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబుకు చెందిన అన్ని పిటిషన్లపై అన్ని కోర్టుల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, నారా లోకేశ్ కు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తుందా? లేక తిరస్కరిస్తుందా? అనే ఆసక్తి నెలకొంది.