పవన్ కళ్యాణ్ ఫై నిప్పులు చెరిగిన లక్ష్మి పార్వతి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మి పార్వతి సంచలన ఆరోపణలు చేసారు. జగన్ ప్రజల్లోకి వెళ్లి పాదయాత్ర చేశారని..పవన్ కల్యాణ్ అలా పాదయాత్ర చేయగలరా అని ప్రశ్నించారు. అసలు పవన్ సిద్దాంతం ఏంటో ఆయనకు అయినా తెలుసా…ఓ సారి టీడీపీతో మరోసారి కమ్యూనిస్టులు, బీజేపీలతో పొత్తు పెట్టుకుంటాడని లక్ష్మి పార్వతి అన్నారు.
పవన్ సొంతంగా ప్రజల్లోకి వెళితే తప్ప నాయకుడు కాలేడని లక్ష్మి పార్వతి వ్యాఖ్యానించారు. విష వృక్షంలో ఉన్నంతకాలం పవన్ ఎదగలేడని అన్నారు. చంద్ర బాబు తన రెండు కండ్ల సిద్దాంతాన్ని మాను కోవాలని లక్ష్మీ పార్వతి అన్నారు. సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆన్లైన్ టికెట్ల పై ఓ నిర్ణయం తీసుకున్నారని, కానీ పవన్ దొంగ టికెట్ల అమ్మకాలకు సపోర్ట్ చేస్తే నాయకుడివి ఎలా అవుతావంటూ ప్రశ్నించారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఫై గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష్మి పార్వతి ఘాటైన వ్యాఖ్యలే చేసారు.
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఫంక్షన్ లో వైసీపీ నేతలపై చేసిన కామెంట్స్ ఫై వైసీపీ నేతలంతా మాటల యుద్ధం చేస్తున్నారు. కేవలం వారే కాదు వైసీపీ అభిమానులు సైతం పవన్ ఫై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.