మద్యం తాగించి యువతిపై సామూహిక అత్యాచారం

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

నిజామాబాద్ : నిజామాబాద్‌లో దారుణం జరిగింది. ఓ యువతికి మద్యం తాగించిన నలుగురు యువకులు ఆమె స్పృహకోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాగా, బాధితురాలు కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/