బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోపై లక్ష్మీపార్వతి

బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోపై వైస్సార్సీపీ నేతలు వరుసపెట్టి విమర్శలు చేస్తున్నారు. వెండితెరఫై అగ్ర హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణ ..బుల్లితెర ఫై కూడా తన సత్తా చాటుకుంటున్నారు. ఆహా ఓటిటిలో అన్ స్టాపబుల్ అనే షో కు హోస్ట్ గా చేసి అలరించిన బాలయ్య..ఇప్పుడు సీజన్ 2 కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ కు సంబదించిన ఫస్ట్ ఎపిసోడ్ ను నారా చంద్రబాబు తో చేసి ఎపిసోడ్ ఫై ఆసక్తి పెంచారు. ఈ ఎపిసోడ్ కు సంబదించిన టీజర్ వచ్చినప్పటి నుండి వైస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు తమ స్పందనను తెలియజేయగా..తాజాగా లక్ష్మీపార్వతి పలు కామెంట్స్ చేసింది.

తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు, బాలకృష్ణ ఈ షోను ఎంచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాడు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నాడన్నది ఒట్టి అబద్ధమని స్పష్టం చేశారు. నాడు పార్టీలో గొడవలు చేయించింది, ఎమ్మెల్యేలను రెచ్చగొట్టింది, ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా రోడ్ల పైకి పిలిచింది చంద్రబాబేనని స్పష్టం చేశారు. ఆ షో చూస్తుంటే, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినవాళ్లు ఒకరినొకరు సమర్థించుకున్నట్టుగా ఉందని విమర్శించారు.