చైనా సరిహద్దులో భారత ప్రత్యేక బలగాలు
భారత్-చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ: మరోసారి వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రత్యేక బలగాలను రంగంలోకి దించింది. పర్వత ప్రాంతాల్లో పనిచేయడం కోసం కఠోర శిక్షణ పొందిన బలగాలను సరిహద్దులకు తరలించింది. ఈ బలగాలకు ఎత్తయిన ప్రాంతాల్లో చైనా అతిక్రమణలను సమర్థంగా తిప్పికొట్టే సామర్థ్యం ఉంది. ఈ బలగాలు సరైన మార్గం లేని, వాహనాలు కూడా వెళ్లలేని ప్రాంతాలకు కాలినడన వెళ్లి యుద్ధం చేయగలవు. పాకిస్థాన్తో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ప్రత్యేక బలగాలు కీలకపాత్ర పోషించాయి. కాగా కీలక ప్రాంతాల్లో ఇరు దేశాలు ఫిరంగులు, ట్యాంకులను సిద్ధం చేస్తుండడంతో పరిస్థితి ఉద్విగ్నంగా ఉంది. అయితే, ఈ నెల 15 తర్వాత గాల్వన్ లోయలో పరిస్థితి మామూలుగానే ఉందని, ఎలాంటి ఘర్షణ చోటుచేసుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, ఇరు దేశాలూ ఇరు వైపులా బలగాలను మోహరిస్తున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు అక్కడ నిర్మాణంలో ఉన్న 32 రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం కేంద్రం హోంశాఖ సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణంపై చర్చిండం కోసం సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/