మూడేళ్ల చిన్నారికి కరోనా వైరస్‌

కేరళలో ఘటన.. కరోనా పాజిటివ్‌ అని అధికారులు వెల్లడి

Corona virus
Corona virus

తిరువనంతపురం: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో కేరళలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయ్యింది. కేరళలోని ఎర్నాకుళంలో మూడేళ్ల చిన్నారికి కరోనా పాజిటివ్‌ అని వైద్య పరీక్షలు నిర్ధారించినట్టు తెలిపారు. ఇటీవలే ఆ చిన్నారి ఇటలీ నుండి వచ్చినట్టు తెలిసిందే. దీంతో ఆ చిన్నారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా కరోనా వైరస్‌ బలపడుతున్న నేపథ్యలో అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/