సల్మాన్ ఖాన్ కు భారీ షాక్..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు భారీ షాక్ తగిలింది. గత రెండేళ్లుగా హిట్ లేని సల్మాన్..కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు. టాలీవుడ్ నటులు జగపతి బాబు , వెంకటేష్ లు నటించడం , రామ్ చరణ్ ప్రత్యేక పాత్ర పోషించడం , పూజా హగ్దే హీరోయిన్ గా నటించడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు. రంజాన్ సందర్బంగా నిన్న విడుదలైన ఈ మూవీ నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు ఫస్ట్ డే అతి తక్కువ కలెక్షన్లు రాబట్టి షాక్ ఇచ్చింది. ఈద్ సందర్భంగా రిలీజైన అన్ని సినిమాలు సల్మాన్కు భారీ విజయాలుగా నిలిచాయి. కానీ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా మాత్రం సల్మాన్కు చేదును మిగిల్చింది.
నిజానికి రిలీజ్కు ముందు వచ్చిన హైప్ చూసి ఈ సినిమా సల్మాన్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ పదేళ్లలో ఈద్కు రిలీజైన సినిమాలన్నిటిలో ఇదే అత్యల్ప కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. 2010లో వచ్చిన దబాంగ్ రూ.14.5 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. అప్పుడున్న టిక్కెట్ రేట్లకు, క్రేజ్కు అది ఓ రికార్డు. కానీ పదమూడేళ్ల తర్వాత వచ్చిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ కేవలం రూ. 15.81 కోట్లు సాధించి సల్మాన్ పేరిట చెత్త రికార్డు నెలకొల్పింది. ఈ 13 ఏళ్లలో ఈద్కు సల్మాన్ నుంచి ఎనిమిది సినిమాలు రిలీజయ్యాయి. ప్రతీ సినిమా కోట్లు కొల్లగొట్టింది. కానీ ఇది మాత్రం సల్మాన్కు నిరాశను మిగిల్చింది. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వీరమ్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది.