నిరాహార దీక్ష విరమించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

నిరుద్యోగులను బిఆర్ఎస్ ప్రభుత్వం వంచించిందంటూ కిషన్ రెడ్డి నిరాహార దీక్ష

kishan-reddy-stop-his-deeksha-in-bjp-state-office

హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిరాహారదీక్షను విరమించారు. ఆయనకు బిజెపి సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. తొమ్మిదేళ్ల పాలనలో నిరుద్యోగులను బిఆర్ఎస్ ప్రభుత్వం వంచించిందని ఆరోపిస్తూ నిన్న ఉదయం హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద 24 గంటల నిరాహారదీక్షను కిషన్ రెడ్డి చేపట్టారు. అయతే సమయం అయిపోయిందంటూ నిన్న సాయంత్రం ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆ సమయంలో పోలీసులకు, బిజెపి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన కిందపడ్డారు. అనంతరం ఆయనను నాంపల్లిలోని బిజెపి కార్యాలయానికి తరలించారు. కిషన్ రెడ్డి దీక్ష చేపట్టి 24 గంటలు పూర్తి కావడంతో ఆయన చేత ప్రకాశ్ జవదేకర్ దీక్షను విరమింజేశారు.