కొద్ది రోజులు ట్విట్టర్ కు దూరం
సౌత్ సీనియర్ నటి ఖుష్బూ వెల్లడి
సౌత్ సీనియర్ నటి ఖుష్బూ సుందర్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది.
తన సినీ కెరీర్ తెలుగులోనే ప్రారంభించిన ఖుష్బూ.. దాదాపు సౌత్ స్టార్ హీరోలు అందరితో నటించింది. అయితే తాజాగా తను ట్విట్టర్ కు కొంతకాలం దూరంగా ఉండబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఖుష్బూ ట్విట్టర్ కి దూరంగా ఉండటం ఇది ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు కూడా ఓసారి ట్విట్టర్ కు దూరంగా ఉంది.
బుధవారం ట్విట్టర్ ద్వారా.. “హాయ్ ఫ్రెండ్స్.. ఈరోజు ఉదయం పొరపాటున నా కంటికి చిన్నపాటి గాయమైంది.
డాక్టర్లు సంప్రదిస్తే కంటికి ఆపరేషన్ చేసి రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారు. అందుకే కొద్దికాలం పాటు ట్విట్టర్కు దూరంగా ఉండబోతున్నాను.
ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు తప్పకుండా వస్తాను.
మీరందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. మాస్కులు ధరించండి.అలాగే భౌతిక దూరం పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలి” అంటూ కుష్బూ ట్వీట్ చేసింది.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/