భద్రాచలంలో పర్యటించిన ఎంపి ‌కవిత

mp maloth kavitha

కొత్తగూడెం: మహబూబాబాద్‌ ఎంపి మాలోత్‌ కవిత ఈరోజు భద్రాచలం పట్టణంలో పర్యటించారు. భద్రాచలం కరకట్ట ప్రాంతానికి చేరుకొని వరద ఉధృతిని పరిశీలించారు. భద్రాద్రికి పోటెత్తిన గోదావరి వరద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముంపుకు గురైన రామాలయం పరిసరాల్లో పర్యటించారు. అక్కడి నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన వరద బాధిత పునరావాస కేంద్రాలను ఎంపీ సందర్శించారు. ఆయా పునరావాస కేంద్రాల్లో ఎంపి కవిత స్వయంగా వరద బాధితులకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, టిఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/