సంగారెడ్డి జిల్లాలో దారుణం : లెఫ్ట్ ఇచ్చి మోసం చేసిన ఖిలాడీలు

సమాజంలో ఎవర్ని నమ్మాలో నమ్మకూడదో అర్ధం కావడం లేదు..తెలియని వారు , తెలిసిన వారు ఇలా అందరు మోసం చేస్తున్నారు. లెఫ్ట్ పేరుతో ఇప్పటికే ఎన్నో దారుణమైన ఘటనలు వెలుగులోకి రాగ, తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ మహిళా కు లెఫ్ట్ ఇచ్చి , ఆ తర్వాత ఆమెకు మత్తుమందు ఇచ్చి ఆమె ఒంటిపై ఉన్న బంగారంతో పాటు ఆమె దగ్గర ఉన్న రూ.25 వేలను ఎత్తుకెళ్లిన ఘటన పటాన్ చెరువు మండలంలోని రామేశ్వరం బండలో చోటుచేసుకుంది.

రామేశ్వరం బండకు చెందిన ఓ మహిళను ఓ జంట దారుణంగా మోసం చేసింది. ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న మహిళను ఓ జంట స్కూటీపై ఎక్కించుకున్నారు. మాట మాట కలిపి ఆమెకు మత్తు కలిపిన కళ్ళు తాగించారు. అనంతరం ఆ మహిళపై ఉన్న బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.25000 తీసుకొని పరారయ్యారు. మత్తు దిగిన తర్వాత బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది.బాధిత మహిళా పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.