నాలుగు జిల్లాల్లో కలెక్టరేట్లను ప్రారంభించబోతున్న సీఎం కేసీఆర్

KCR to resume tours of districts

తెలంగాణ సీఎం కేసీఆర్ నాలుగు జిల్లాల్లో కలెక్టరేట్లను ప్రారభించబోతున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ను ఖరారు చేసారు. ఈ నెల 25న గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నూతనంగా నిర్మించిన రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అదేవిధంగా 29వ తేదీన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని, సెప్టెంబర్ 5వ తేదీన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని, సెప్టెంబర్ 10వ తేదీన జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నట్టు అధికార వర్గాలు ప్రకటించాయి.

కెసిఆర్ పర్యటన నేపథ్యంలో అన్ని చోట్ల భారీగా జన సమీకరణ చేసి బహిరంగ సభలు నిర్వహించేందుకు ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్‌‌, మేడ్చల్‌‌ మల్కాజ్​గిరి కలెక్టరేట్లను కేసీఆర్‌‌ ఇప్పటికే ప్రారంభించారు. మిగిలిన జిల్లాల్లోని ఇంటిగ్రేటెడ్‌‌ కలెక్టరేట్లను ఈఏడాది చివరి నాటికి ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల విభజన తరువాత అన్ని చోట్ల సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా చాలా వరకు నిర్మాణాలు పూర్తికావొచ్చాయి.