ఆగస్టు 4న కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారభించబోతున్న సీఎం కేసీఆర్

పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 4న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ సెంటర్ ప్రారంభం కాబోతుంది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్‌లో మరో కలికితురాయిగా చెప్పాలి.. ఎక్కడేం జరిగినా క్షణాల్లో పసిగట్టే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ముస్తాబవుతోంది. దేశంలో అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ సీసీసీ నిర్మాణం చేపట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వందల కోట్లతో 18 అంతస్తులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం చేపట్టారు.

18 అంతస్తులున్న ఈ భవనంలో సందర్శకులు 14, 15 అంతస్తుల వరకు వెళ్లేందుకు అధికారులు అనుమతిస్తారు. అక్కడి నుంచి నగరాన్ని 360 డిగ్రీల కోణంలో వీక్షించొచ్చు. టికెట్లు కొన్నవారికే అనుమతి ఉంటుంది. ఆరో అంతస్తులోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి వచ్చి బయటనుంచి పోలీసులు చేస్తున్న ఆపరేషన్‌ను వీక్షించేందుకూ అనుమతిస్తారు.

ఇక ఈ కమాండ్ సెంటర్ భవనం ఒక లక్షా 12 వేల 77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. తెలంగాణలోని ప్రతి అంగుళం ఇక 360 డిగ్రీల కోణంలో పోలీస్ రాడార్ పరిధిలోకి వస్తుంది. ఈ బిల్డింగ్ అందుబాటులోకి వస్తే .. రాష్ట్రంలో ఏ మూలన ఏం జరిగినా కూడా క్షణాల్లో కనిపెట్టొచ్చు.. ఈ భవనం నిర్మాణం 350 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టినా.. తర్వాత మరో 200 కోట్లు కేటాయించారు.. 7 ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో నాలుగు బ్లాకుల్లో ఏ, బీ, సీ, డీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ టవర్లుంటాయి. ఇక టవర్-ఏ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 84.2 మీటర్ల ఎత్తు ఉండగా.. టవర్-బీ, సీ, డీలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 65.2 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇందులో ముఖ్యమైంది ఆఫీస్ బిల్డింగ్ టవర్-ఏనే అని చెప్పాలి.. హెలిప్యాడ్‌తో కలిపి జీ ప్లస్ 20 అంతస్తుల్లో టవర్-ఏ నిర్మించారు. అలాగే ఓపెన్ ఆఫీస్ మీటింగ్ రూమ్స్ కాన్ఫరెన్స్ రూం క్యాబిన్లు ఉంటాయి.