ఈ నెల 29 న ముస్లిం సోద‌రుల‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇఫ్తార్ విందు

రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 29న సాయంత్రం 6:10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఇఫ్తార్ విందుకు ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, హాజ‌ర‌వుతార‌ని కేసీఆర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం నేడు మత సామరస్యానికి, గంగా జమున తహజీబ్‌కు వేదికగా నిలిచిందని ఈ సందర్భంగా పేర్కొన్న సీఎం.. సర్వ మతాల సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు.. ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరుస్తున్నది. లౌకికవాదాన్ని కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది.. అని కేసీఆర్ తెలిపారు.