మీకో దండంరా నాయనా..అంటూ రూమర్లకు చెక్ పెట్టిన సింగర్ సునీత

సింగర్ సునీత తల్లి కాబోతుందంటూ కొన్ని గంటలుగా సోషల్ మీడియా లో వార్తలు వైరల్ గా మారాయి. ఈ వార్తలు చూసి చాలామంది నిజమే అనుకోని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది సునీత. ఈ మధ్యనే సునీత డిజిటల్ మీడియా వ్యాపార దిగ్గజం రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, సునీత సోషల్ మీడియాలో ఓ మామిడి చెట్టు వద్ద కూర్చుని , మామిడి కాయ పట్టుకొని దిగిన ఫోటో ను పోస్ట్ చేసింది. అంతే ఆలా పోస్ట్ చేసిందో లేదో సోషల్ మీడియా లో సునీత తల్లికాబోతుందంటూ కథనాలు ప్రచారం అయ్యాయి.

ఈ వార్తలు వైరల్ గా మారడం తో సునీత స్పందించింది. “మీకో దండంరా నాయనా… జనాలు ఇంత క్రేజీగా ఉంటారా… మామిడి చెట్టుకు తొలిసారి కాయలు కాయడంతో వాటితో ఫొటో దిగాను. దాన్ని ఈ విధంగా ప్రచారం చేస్తారా? ఊహాజనిత కథనాలు, రూమర్లను వ్యాప్తి చేయడం ఇకనైనా ఆపండి” అంటూ సునీత హితవు పలికారు.