సోషల్ మీడియా లో అడుగుపెట్టిన కేసీఆర్..కాంగ్రెస్ ఫై విమర్శలు

బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ సైతం సోషల్ మీడియా లో అడుగుపెట్టారు. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్బంగా కేసీఆర్ సోషల్ మీడియా ఖాతాను ఓపెన్ చేసారు. ఈ సందర్బంగా వరుస ట్వీట్స్ తో తన దూకుడు ను కనపరుస్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఉద్య‌మ కాలం నాటి త‌న ఫొటోను కేసీఆర్ జ‌త చేశారు. ఆ తర్వాత బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దాం అని కోరుతూ కేసీఆర్ రెండో ట్వీట్ చేశారు.

మూడో ట్వీట్ కరెంట్ కటింగ్ లపై స్పందించారు.తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయింది. ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారు. నాతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నదని ఈ సందర్భంగా నాకు చెప్పారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి అని కేసీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.